తెలంగాణ

telangana

ETV Bharat / photos

వందేభారత్​ స్లీపర్​ కోచ్​ రెడీ- పరీక్షల తర్వాత పట్టాలపైకి! సౌకర్యాలు అదుర్స్​

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 10:27 AM IST

Vande Bharat Sleeper Coach : వందేభారత్​ స్లీపర్​ క్లాస్​ కోచ్​లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని భారత్​ ఎర్త్ మూవర్స్​ లిమిటెడ్​లో (BEML) జరిగిన కార్యక్రమంలో స్లీపర్​ కోచ్​ను రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, వందేభారత్ రైలు చైర్​కార్​, స్లీపర్​, మెట్రో రకాలుగా ఉంటుందని తెలిపారు.
Vande Bharat Sleeper Coach : అత్యాధునిక ఫీచర్లతో ప్రజలకు అందుబాటులోకి రానుంది వందేభారత్​ స్లీపర్​ కోచ్​. స్లీపర్​ క్లాస్​​ను త్వరలోనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్​ వెల్లడించారు.
శనివారం బెంగళూరులోని భారత్​ ఎర్త్ మూవర్స్​ లిమిటెడ్​లో (BEML) జరిగిన కార్యక్రమంలో స్లీపర్​ కోచ్​ను ఆయన ఆవిష్కరించారు.
సులభంగా రైలులోకి ప్రవేశించేందుకు వీలుగా మెట్ల ప్రదేశాన్ని పెంచుతున్నారు.
టాయిలెట్లను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నారు. ఎయిర్​ కండీషనింగ్​ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు.
సీట్​ కుషన్లను కొత్త టెక్నాలజీతో మారుస్తున్నారు. 99శాతం వైరస్​ను కట్టడి చేసి, ఆక్సిజన్​ లెవల్స్​ సరిగ్గా ఉండేలా చూస్తారు.
స్లీపర్​ కోచ్​ ఎలాంటి కుదుపులు, శబ్ధాలు లేకుండా ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
రైలు నిర్మాణం పూర్తి కాగా, లోపలి ఫర్నీషింగ్​ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. తాము రూపొందించిన ఈ తొలి ట్రైన్​ను సుమారు 5-6నెలల వరకు పరీక్షిస్తామని, ఆ తర్వాతే ప్రారంభిస్తామని వివరించారు.
స్లీపర్​ కోచ్​ సైతం అంతకుముందున్న చైర్​ కార్​ టెక్నాలజీతోనే నడుస్తుందని, ఎలాంటి కుదుపులు, శబ్ధాలు లేకుండా ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అశ్విణి వైష్ణవ్​ పేర్కొన్నారు.
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని BEML రైలు, మెట్రో సహా వివిధ నిర్మాణాలను చేస్తోంది. ఇప్పటికే 160 వందేభారత్​ స్లీపర్​ బోగీల నిర్మాణాలను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details