తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రాజస్థాన్​ కోటల రాజసం చూసేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా చాలా తక్కువ!

-పది రోజుల పాటు రాజస్థాన్​ అందాలు చూసేందుకు ప్యాకేజీ -అందుబాటు ధరలోనే IRCTC టూర్​

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

IRCTC Royal Rajasthan Tour Vishakhapatnam
IRCTC Royal Rajasthan Tour Vishakhapatnam (ETV Bharat)

IRCTC Royal Rajasthan Tour Vishakhapatnam:రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు.. రాజస్థాన్​ పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేవి. అంతేనా ప్రముఖుల వివాహాలూ ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకునే వారు చాలా మందే ఉంటారు. అయితే అలాంటి వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అవకాశం కల్పిస్తోంది. అన్ని వసతులు ఉండే విధంగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీసీ రాయల్​ రాజస్థాన్​ టూర్​ ఎక్స్​ విశాఖపట్నం పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. వైజాగ్​ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్​ ఉంటుంది. మొత్తం 9రాత్రుళ్లు, 10 పగళ్లు ఈ టూర్​ కొనసాగుతుంది. ఈ టూర్​లో అజ్మీర్​, బికనీర్​, జైపూర్​, జైసల్మేర్​, జోధ్​పూర్​, మౌంట్​ అబూ, పుష్కర్​, ఉదయ్​పూర్​ వంటి ప్రదేశాలు చూడొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం 7:40 గంటలకు వైజాగ్​ ఎయిర్​పోర్ట్ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్​ చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తి చేసుకున్న తర్వాత ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి స్టే చేయాలి.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హవా మహల్​, జంతర్​ మంతర్​, సిటీ ప్యాలెస్​, అమేర్​ ఫోర్ట్​ విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత బికనీర్​కు వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత Camel Breeding Farm, దేశ్నోకే ఆలయం దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జునాగఢ్​ కోట విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి జైసల్మేర్​ వెళ్తారు. అక్కడ సాయంత్రం ఇసుక దిబ్బలు చూసి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జోధ్​పూర్​ వెళ్తారు. మార్గమధ్యలో జైసల్మేర్​ కోట, పట్వోన్ కి హవేలీ అండ్​ వార్​ మ్యూజియం విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి జోధ్​పూర్​లో స్టే చేస్తారు.
  • ఆరో రోజుబ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఉమైద్​ భవన్​ మ్యూజియం, మెహరన్​గఢ్​ కోట విజిట్​ చేసి ఉదయ్​పూర్​కు వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఏడో రోజు టిఫెన్​ తర్వాత మౌంట్​ అబూ, నక్కిలేక్​, దిల్వారా టెంపుల్​ కాంప్లెక్స్​ విజిట్​ చేస్తారు. తిరిగి ఉదయ్​పూర్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి స్టే చేస్తారు.
  • ఎనిమిదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సిటీ ప్యాలెస్​, ఎక్లింగ్జీ విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి పుష్కర్​కు వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • తొమ్మిదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పుష్కర్​ టెంపుల్​ దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరిగి జైపూర్​ వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • పదోరోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ఎయిర్​పోర్ట్​కు బయలుదేరుతారు. మధ్యాహ్నం వైజాగ్​కు ఫ్లైట్​ జర్నీ ఉంటుంది. రాత్రి విశాఖపట్నం చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

ధర వివరాలు ఇవే:

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.68,800, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.51,490, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.48,630 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.40,290, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.37,300 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • మీల్స్​: బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​
  • ప్యాకేజీని బట్టి సైట్​ సీయింగ్​ కోసం వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 17వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

IRCTC సూపర్​ ప్యాకేజీ - మీనాక్షి అమ్మన్​ ఆలయంతోపాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! - ధర కూడా అందుబాటులోనే!

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

ABOUT THE AUTHOR

...view details