తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 5:25 PM IST

ETV Bharat / offbeat

ఐఆర్​సీటీసీ కేరళ టూర్​ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! ధర చాలా తక్కువ! - IRCTC Kerala Hills and Water Tour

IRCTC Kerala Tour: కేరళ ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్​ చేయాలనుకుంటున్న టూరిస్టులకు గుడ్​న్యూస్​ చెప్పింది ఐఆర్​సీటీసీ టూరిజం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Kerala Hills and Water
IRCTC Kerala Hills and Water Tour Package (ETV Bharat)

IRCTC Kerala Hills and Water Tour Package: ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ .. యాత్రికుల కోసం రకరకాల ప్యాకేజీలను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు మొదలు చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాల సందర్శన వరకు అందుబాటు ధరలలోనే ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోంది. తాజాగా కేరళ అందాలను చూసి ప్రకృతి ఒడిలో గడిపేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ టూర్​ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC టూరిజం కేరళ హిల్స్​ అండ్​ వాటర్​ పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ ట్రిప్​లో మున్నార్, అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఉంటుంది.

  • మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Train No.17230) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్​ప్రెస్​ బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత.. సాయంత్రం మున్నార్ ​టౌన్​లో పలు ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ రాత్రికి మున్నార్ లోనే స్టే చేస్తారు.
  • మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్​ పార్క్​(Eravikulam National Park)ను విజిట్​ చేస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్​తో పాటు ఏకో పాయింట్​ను సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా మున్నార్​లోనే బస చేస్తారు.
  • నాలుగో రోజు హోటల్ నుంచి చెక్​ అవుట్​ చేసి అలెప్పీకి వెళ్తారు. హోటల్​లో చెకిన్ అయిన తర్వాత.. backwater ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆరోజు మొత్తం ఎంజాయ్​ చేస్తారు. ఆ రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత తిరిగి ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఐఆర్​సీటీసీ "మ్యాజికల్​ మధ్యప్రదేశ్​" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ!

ధర వివరాలు చూస్తే:ఒకటి నుంచి ముగ్గురు ప్రయాణికులకు ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 34,480గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.19,910, ట్రిపుల్​ షేరింగ్​ రూ .16,260గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.10,730, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.8,420గా ఉంది.
  • స్టాండర్డ్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 31,750గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.17,180, ట్రిపుల్​ షేరింగ్​ రూ .13,530గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.8,000, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.5,690గా ఉంది.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • హైదరాబాద్​ - ఎర్నాకులం- హైదరాబాద్​ ట్రైన్​ టికెట్లు
  • ప్యాకేజీని బట్టి లోకల్​ ట్రాన్స్​పోర్ట్​కు వెహికల్​ అరేంజ్​ చేస్తారు.
  • బ్రేక్​ఫాస్ట్​తో కలిపి అకామిడేషన్​ ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 1, 22, నవంబర్​ 12వ తేదీల్లో అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ టూ వయనాడ్​ - అతి తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ!

షిరిడీ సాయి నాథుని దర్శనంతో పాటు మినీ తాజ్​మహల్​ చూడొచ్చు - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details