తెలంగాణ

telangana

IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీ - తక్కువ ధరకే కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు చూసేయండి! - IRCTC Latest Tour Package

By ETV Bharat Features Team

Published : Sep 18, 2024, 2:29 PM IST

IRCTC Latest Tour Package : పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లాలనుకునేవారికి గుడ్​న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం.. తక్కువ ధరకే కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా హైదరాబాద్​ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మరి.. ఈ టూర్​ ఎలా సాగుతుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Divine Karnataka Tour Package
IRCTC Latest Tour Package (ETV Bharat)

IRCTC Divine Karnataka Tour Package :ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం (IRCTC) గతకొంతకాలంగా ప్రయాణికుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకొనే వారికోసం ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఆర్​సీటీసీ.. ‘DIVINE KARNATAKA’ పేరిట ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా.. ప్రస్తుతం అక్టోబర్ 22, 29 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. ఆసక్తి గల ప్రయాణికులు ఈ ప్యాకేజీని వినియోగించుకోవచ్చు.

టూర్ కొనసాగుతుందిలా..

  • కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. అంటే.. మొదటి రోజు మార్నింగ్ 6:05 గంటలకు స్టేషన్​లో కాచిగూడ- మంగళూర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నంబర్ 12789) ఎక్కడంతో మీ పర్యటన ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.
  • రెండో రోజు మార్నింగ్ 9:30 గంటలకు మంగళూరు రీచ్ అవుతారు. అక్కడి నుంచి ఉడిపికి వెళ్తారు.
  • ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అనంతరం శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి, మాల్పే బీచ్‌కు వెళ్తారు. ఈ నైట్ ఉడిపిలోనే బస చేస్తారు.
  • ఇక మూడోరోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయి శృంగేరీకి వెళ్తారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మంగళూరు రిటర్న్ అవుతారు. అక్కడ ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో బస ఉంటుంది. రాత్రికి అక్కడే నిద్ర చేస్తారు.
  • నాలుగో రోజు ధర్మస్థలకు వెళ్తారు. అక్కడ ప్రసిద్ధి చెందిన మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కుక్కే సుబ్రమణ్య ఆలయానికి వెళ్తారు. ఈవెనింగ్ తిరిగి మంగళూరుకు పయనమవుతారు. నైట్ మంగళూరులోనే స్టే చేస్తారు.
  • ఐదో రోజు మంగళాదేవి, కదిరి మంజునాథ ఆలయాలను సందర్శిస్తారు. ఈవెనింగ్ తన్నెరభావి బీచ్‌, కుద్రోలి గోకర్నాథ దేవాలయానికి వెళ్తారు.
  • అనంతరం మంగళూరు రైల్వేస్టేషన్​కు వెళ్లి నైట్ 8 గంటలకు (ట్రైన్‌ నంబర్ 12790) రైలు ఎక్కుతారు.
  • ఆరో రోజు రాత్రి 11:40 గంటలకు రైలు కాచిగూడ చేరడంతో మీ టూర్ కంప్లీట్ అవుతుంది.

రాజస్థాన్​ కోటల రాజసం చూస్తారా? - తక్కువ ధరలోనే IRCTC అద్భుతమైన ప్యాకేజీ!

ప్యాకేజీ ధరల విషయానికొస్తే..

ఒకరి నుంచి ముగ్గురు బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్​లో(థర్డ్‌ ఏసీ) .. సింగిల్​ షేరింగ్​కి రూ. 38,100 ఛార్జ్ చేస్తారు. ట్విన్​ షేరింగ్​కు రూ.22,450, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ.18,150గా నిర్ణయించారు. ఇక ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు విత్​ బెడ్​తో రూ.11,430, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,890గా చెల్లించాల్సి ఉంటుంది.
  • స్టాండర్ట్‌లో(స్లీపర్ బెర్త్).. సింగిల్ షేరింగ్​కి రూ.35,070, డబుల్ షేరింగ్‌కు రూ.19,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,130 వెచ్చించాలి. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.8,410, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,860 చెల్లించాలి.

నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్‌లో(థర్డ్‌ ఏసీ) .. డబుల్‌ షేరింగ్‌కు రూ.19,190, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.17,110గా నిర్ణయించారు. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ.11,430, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,890 వెచ్చించాలి.
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.8,410, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,860 చెల్లించాలి.
  • ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

IRCTC నార్త్​ ఇండియా టూర్​ - రూ.35వేలకే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - పైగా ఫ్లైట్​ జర్నీ!

ABOUT THE AUTHOR

...view details