Mudra loans : స్త్రీలు స్వయం సమృద్ధి సాధించాలంటే, కచ్చితంగా ఆర్థికంగా ఎదగాల్సి ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్) పరిధిలో వంద రోజుల కార్యక్రమం అమలు చేస్తోంది.
గతేడాది డిసెంబర్ 22న మొదలైన ఈ కార్యక్రమం, మార్చి 31తో ముగియనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వృత్తులు, వ్యాపారాలు చేసుకునే మహిళలకు పెట్టుబడి అవసరాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుంది. మరి, ఏయే రంగాల్లోని మహిళలు రుణం ఇస్తారు? ఎంతెంత రుణం అందుతుంది? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
వారికోసం "పీఎం స్వనిధి"
పట్టణాలు, నగరాల్లో వీధి వ్యాపారులు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఎండా, వానకు ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేయడం ఒకెత్తయితే, పెట్టుబడి కోసం పడే తిప్పలు మరో ఎత్తు. చాలా మంది డైలీ ఫైనాన్స్ నడిపేవారి వద్ద అప్పు తీసుకుంటూ ఉంటారు. రోజూ 500 రూపాయల నుంచి రూ.2వేల దాకా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకుంటూ ఏకంగా 10 రూపాయల వడ్డీ చొప్పున తిరిగి చెల్లిస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఉద్దేశించినదే "పీఎం స్వనిధి". ఈ స్కీమ్ ద్వారా జీవీఎంసీ పరిధిలో బ్యాంకు లింకేజీ రుణం అందిస్తున్నారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులు రూ.10 వేల రుణం పొందొచ్చు. నిబంధనల ప్రకారం రుణం తీర్చిన తర్వాత, మళ్లీ తీసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. వడ్డీ చెల్లింపుల్లో రాయితీని కూడా అందిస్తున్నారు.
"ముద్ర" రుణాలు :