ETV Bharat / offbeat

'హైదరాబాద్​ to అరుణాచలం' - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - తక్కువ ధరకే ఈ ప్రదేశాలన్నీ! - TELANGANA TOURISM ARUNACHALAM TOUR

- నాలుగు రోజుల పాటు అద్దిరిపోయే టూర్ - సందర్శించే ప్రాంతాలు ఇవే

Telangana Tourism Arunachalam Package
Telangana Tourism Arunachalam Package (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 2:39 PM IST

Telangana Tourism Arunachalam Package: తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం "అరుణాచలం". దీన్నే తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. పరమేశ్వరుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది అరుణాచలేశ్వరుడి దర్శించుకోవడానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, తెలంగాణ టూరిజం మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది. భాగ్యనగరం నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టూరిజం హైదరాబాద్ - అరుణాచలం పేరుతో టూర్​ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ టూర్​లో అరుణాచలేశ్వర టెంపుల్​తో పాటు వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం కవర్ అవుతాయి. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్​ ఉంటుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది.

ప్రయాణం ఎలా ఉంటుందంటే:

  • మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్​లోని బషీర్​బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ TTDC ఆలయం హోటల్​లో చెకిన్​ అవుతారు. లంచ్​ తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి స్టార్ట్​ అవుతారు. మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. లంచ్​ తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. దర్శనం అనంతరం రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • నాలుగో రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ పూర్తవుతుంది.

టూర్ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం ప్రకటించిన అరుణాచలం టూర్​ ప్యాకేజీ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ టూర్​లో పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్​ అకామడేషన్ కవర్ అవుతాయి. ఇక ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనాల ఏర్పాట్లు పర్యాటకులే సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ మార్చి 11వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ​ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కేవలం రూ.380కే హైదరాబాద్​ సిటీ టూర్​ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!

హైదరాబాద్ టూ శ్రీశైలం - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!

Telangana Tourism Arunachalam Package: తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం "అరుణాచలం". దీన్నే తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. పరమేశ్వరుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది అరుణాచలేశ్వరుడి దర్శించుకోవడానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, తెలంగాణ టూరిజం మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది. భాగ్యనగరం నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టూరిజం హైదరాబాద్ - అరుణాచలం పేరుతో టూర్​ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ టూర్​లో అరుణాచలేశ్వర టెంపుల్​తో పాటు వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం కవర్ అవుతాయి. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్​ ఉంటుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది.

ప్రయాణం ఎలా ఉంటుందంటే:

  • మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్​లోని బషీర్​బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ TTDC ఆలయం హోటల్​లో చెకిన్​ అవుతారు. లంచ్​ తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి స్టార్ట్​ అవుతారు. మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. లంచ్​ తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. దర్శనం అనంతరం రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • నాలుగో రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ పూర్తవుతుంది.

టూర్ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం ప్రకటించిన అరుణాచలం టూర్​ ప్యాకేజీ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ టూర్​లో పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్​ అకామడేషన్ కవర్ అవుతాయి. ఇక ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనాల ఏర్పాట్లు పర్యాటకులే సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ మార్చి 11వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ​ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కేవలం రూ.380కే హైదరాబాద్​ సిటీ టూర్​ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!

హైదరాబాద్ టూ శ్రీశైలం - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.