తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - పతనమవుతున్న మీడియా, బ్యాంక్, మెటల్ షేర్లు - Stock Market Today

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

Stock Market Today
Stock Market Today (ANI)

Stock Market Today October 7, 2024 :ఐదు రోజుల భారీ నష్టాలకు అడ్డుకట్ట పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు వస్తుండడ వల్ల దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికాలో సెప్టెంబరులో నియామకాలు బలంగా పుంజుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ఇవాళ 25,100 మార్క్‌ను దాటింది. అయితే ఈ వారంలో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెలువడనున్నాయి. కనుక మదుపర్లు కాస్త అప్రమత్తత పాటించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు బాగా రాణిస్తుండగా, మెటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు లాభపడి 81,973 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు వృద్ధిచెంది 25,076 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :ఐటీసీ, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :టైటాన్‌, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హిందూస్థాన్ యూనిలివర్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, మారుతి సుజుకి, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open October 7, 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.97గా ఉంది.

LIVE FEED

12:11 PM, 7 Oct 2024 (IST)

నిఫ్టీ@24,900

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, మెటల్ షేర్లు పతనమవుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోయి 81,448 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయి 24,901 వద్ద ట్రేడవుతోంది.

11:47 AM, 7 Oct 2024 (IST)

బేర్‌ దెబ్బకు నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 24,950 పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 81,589 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 24,949 వద్ద ట్రేడవుతోంది.

10:34 AM, 7 Oct 2024 (IST)

నిఫ్టీ@25,025

Stock Market Today :దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు రాణిస్తుండగా, మెటల్‌, టెలికాం, మీడియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 91 పాయింట్లు లాభపడి 81,779 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు వృద్ధిచెంది 25,025 వద్ద ట్రేడవుతోంది.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌ అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.9,896.95 కోట్ల విలువై ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,905.08 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 7, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధర 0.44 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 77.71 డాలర్లుగా ఉంది.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details