Old Couple Marriage In Maharashtra :84 ఏళ్ల వృద్ధుడు 66 ఏళ్ల వృద్ధురాలిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని వృద్ధుడి కుమారులు, కుమార్తెలు కలిసి ఘనంగా జరిపించారు. తండ్రి పెళ్లి బరాత్లో వారందరూ డ్యాన్స్తో అదరగొట్టారు. ఈ సంఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగింది.
అంజన్ గావ్ సర్జి తాలూకాలోని చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే(84) భార్య మూడేళ్ల క్రితం మరణించింది. విఠల్ ఖండారేకు నలుగురు కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే విఠల్ తన భార్య లేకపోవడం వల్ల ఒంటిరితనంతో బాధపడ్డారు. పెళ్లి చేసుకుంటానని తన పిల్లలకు చెప్పారు. మొదట్లో విఠల్ పెళ్లి నిర్ణయంపై వారు తిరస్కరించారు. అయినా విఠల్ పెళ్లికి పట్టుపట్టడం వల్ల పెళ్లికి ఆంగీకరించారు. ఆ తర్వాత పెళ్లి కుమార్తెను వెతకడం ప్రారంభించారు.
విఠల్ ఖండారే వయసు 84 కావడం వల్ల ఆయనకు పెళ్లి కుమార్తె దొరకడం కష్టమైంది. అయినప్పటికీ విఠల్ కుమారులు తీవ్రంగా తండ్రి కోసం పెళ్లి కూతుర్ని వెతికారు. ఇటీవల అకోలా జిల్లాలోని అకోట్కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలితో విఠల్ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో మే 8న చించోలి రహీమాపుర్ గ్రామంలో విఠల్ ఖండారే వివాహ వేడుక ఘనంగా జరిగింది. విఠల్ను పెళ్లి కుమారుడిని చేసి అతడి కుమారులు ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఈ ఆనందంలో విఠల్ కుమారులు, మనవరాళ్లు, మనవళ్లు ఊరేగింపులో డ్యాన్స్ వేశారు.