తెలంగాణ

telangana

నేను ఏ తప్పూ చేయలేదు- కుట్రపూరితంగా ఇరికించారు: కోల్​కతా హత్యాచార నిందితుడు! - Kolkata Doctor Murder Case

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 7:27 PM IST

Kolkata Doctor Case Polygraph Test : కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనతో తనకు ఏ సంబంధం లేదని ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ కోర్టుకు చెప్పినట్లు తెలిసింది. పాలీగ్రాఫ్‌ టెస్టు గురించి జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పాలీగ్రాఫ్‌ పరీక్షకు ఎందుకు అంగీకరించావ్‌ అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఈ టెస్టుతో అయినా నిజం బయటపడుతుందని నిందితుడు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది.

Kolkata Doctor Case Polygraph Test
Kolkata Doctor Case Polygraph Test (ETV Bharat)

Kolkata Doctor Case Polygraph Test : కోల్‌కతా హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ మాట మార్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నిందితుడితో సహా మరో ఆరుగురికి శనివారం పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన సంజయ్ పాలీగ్రాఫ్ టెస్ట్​లో మాటమార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ హత్యాచార కేసుకు సంబంధించి సీబీఐ కస్టడీ ముగియటం వల్ల నిందితుడు సంజయ్​ను శనివారం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఈ సందర్భంగా సంజయ్ పాలీగ్రాఫ్‌ పరీక్షకు అంగీకరించాడు. దర్యాప్తు అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు జరపాలంటే కోర్టుతోపాటు అతడు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలీగ్రాఫ్‌ పరీక్షకు ఎందుకు అంగీకరించావని మెజిస్ట్రేట్‌ ప్రశ్నించగా నిందితుడు సంజయ్‌రాయ్‌ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలని పాలీగ్రాఫ్‌ టెస్ట్‌కు అంగీకరించానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను కుట్రపూరితంగా ఇరికించారని కన్నీరుపెట్టుకున్నట్లు జాతీయమీడియా కథనాలు వెలువడ్డాయి.

అంతకుముందు సీబీఐ విచారణలో నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ వైద్యబృందం నిందితుడి మానసికతీరును విశ్లేషించినపుడు ఘటనాక్రమానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు గుక్కతిప్పకుండా చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. నిందితుడిలో కనీసం పశ్చాత్తాపంలేదని ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంతలోనే నిందితుడు మాటమార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గ్యాంగ్​రేప్​ జరగలేదా?
మరోవైపు హత్యాచార ఘటనలో గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు కానీ మరికొందరి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ పేర్కొనలేదని తెలుస్తోంది. ట్రయల్‌ కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్‌ నోట్‌లో అలాంటి విషయాలేవీ లేవని సమాచారం. ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ను జ్యుడీషియల్ కస్టడీ విధించాలని మాత్రమే కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు జడ్జి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందనీ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సీబీఐ రిమాండ్‌ రిపోర్టులోని అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

'ఆమె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు! సెమినార్​ హాల్​ బయట ఉన్నదెవరు?' : సీబీఐ - Kolkata Doctor Case CBI Update

'అశ్లీలతకు బానిస, పశువు లాంటి వాడు'- కోల్​కతా హత్యాచార నిందితుడి సైకోఅనలిటిక్ ప్రొఫైల్​లో కీలక విషయాలు! - Kolkata Doctor Case Accused

ABOUT THE AUTHOR

...view details