తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా! - IRCTC Sundar Saurashtra Package

IRCTC Gujarat Package: గుజరాత్​లోని పర్యాటక ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Gujarat Package
IRCTC SUNDAR SAURASHTRA PACKAGE (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 5:31 PM IST

IRCTC Gujarat Package: గుజరాత్‌ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. అయితే వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో కవర్‌ చేయాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజీ మీ కోసమే. గుజరాత్‌లోని పర్యాటక స్థలాలను చూడటం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) "సుందర్‌ సౌరాష్ట్ర" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ టూర్‌ కొనసాగుతుంది. సికింద్రాబాద్‌తో పాటు గుల్బర్గా, కళ్యాణ్‌, పుణె, సోలాపుర్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

రైలు ప్రయాణం ఇలా...

  • మొదటి రోజు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం. 20967) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్​ అయ్యాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే స్టే చేయాలి.
  • మూడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయిన తర్వాత లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని చూసి అహ్మదాబాద్ బయల్దేరుతారు. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు ద్వారక బయలుదేరతారు. మార్గమధ్యలో జామ్​నగర్​ కోట, మ్యూజియం చూడొచ్చు. సాయంత్రానికి ద్వారక చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

"ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." - కశ్మీర్​ అందాల వీక్షణకు IRCTC స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Mystical Kashmir Tour

  • ఐదో రోజు ఉదయం ద్వారకాదీష్​ టెంపుల్​ను దర్శించుకుంటారు. తర్వాత బెట్​ ద్వారక, నాగేశ్వర్​ టెంపుల్​, శివరాజ్​పూర్​ బీచ్​ చూసి తిరిగి ద్వారకకు రిటన్​ అవుతారు. రాత్రికి ద్వారకలోనే బస చేయాలి.
  • ఆరో రోజు సోమ్​నాథ్​కు స్టార్ట్​ అవుతారు. మార్గమధ్యలో పోర్​బందర్​ కీర్తి మందిర్​, సుధామా టెంపుల్​ చూడొచ్చు. సోమ్​నాథ్​కు చేరుకున్న తర్వాత సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత పోర్‌బందర్‌ చేరుకుంటారు.
  • ఏడో రోజు అర్ధరాత్రి 00:50 గంటలకు పోర్‌బందర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.20968 )లో తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఎనిమిదో రోజు ఉదయం 8:20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో టూర్‌ పూర్తవుతుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవీ..

  • యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
  • ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
  • నాలుగు రోజులు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది.
  • ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
  • టూర్‌ ప్యాకేజీలో ఉండే సందర్శనా ప్రదేశాల రుసుముల బాధ్యత ఐఆర్‌సీటీసీదే.

ప్యాకేజీ వివరాలు ఇవీ.. (టికెట్‌ ధర ఒక్కొక్కరికీ)..

  • కంఫర్ట్​లో ట్విన్​ షేరింగ్​కు రూ.28,280, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.27,610 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.22,060, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.20,020 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో ట్విన్​ షేరింగ్​కు రూ.25,430, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.24,760 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.19,210, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.17,170 పే చేయాలి. చెల్లించాలి.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

ABOUT THE AUTHOR

...view details