thumbnail

By

Published : Oct 12, 2022, 3:58 PM IST

ETV Bharat / Videos

నాటకం మధ్యలో గుండెపోటుతో శివుడి పాత్రధారి మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ నాటకం ప్రదర్శిస్తుండగా అపశ్రుతి జరిగింది. ఆదర్శ్ రామ్​లీలా సమితి బ్యానర్​లో భాగంగా జౌన్​పూర్​ జిల్లాలోని బెలాసిన్​ గ్రామంలో రామ్​లీలా స్జేజ్​పై ఓ నాటకం ప్రదర్శించారు. నాటకం ప్రారంభంలో హారతి ఇస్తున్న సమయంలో శివుడు పాత్రధారి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. 52 ఏళ్ల రామ్ ప్రసాద్ అలియాస్ ఛబ్బన్ పాండేను వెంటనే గ్రామస్థులు ఆస్పత్రికు తరలించినా ఫలితం లేకపోయింది. రామ్​ ప్రసాద్​ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. రామ్​ ప్రసాద్​ మృతి విషయం తెలియగానే కుటుంబీకులు, గ్రామ ప్రజలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్​లో చిత్రించగా ప్రస్తుతం ఇది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. రామ్ ప్రసాద్ మృతి నేపథ్యంలో ఈ ఏడాది జరగవలసిన ప్రదర్శనను వచ్చే సంవత్సరానికి వాయిదా వేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.