కుక్కను మింగేసిన 13 అడుగుల పైథాన్.. ఏనుగు హల్చల్..! - కర్ణాటక చామనగర్లో పాఠశాలలోకి ప్రవేశించిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15945988-thumbnail-3x2-elephant.jpg)
రాజస్థాన్ కోటాలో 13 అడుగుల పైథాన్ హల్చల్ చేసింది. థర్మల్ కాంప్లెక్స్ సమీపంలో ఓ కుక్కను మింగేసింది. అనంతరం పాము అడవిలోకి వెళ్లిపోయింది. మరోవైపు, కర్ణాటక చామరాజనగర్లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలోకి ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును బెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం గజరాజు అడవిలోకి పారిపోయింది. ఉత్తరాఖండ్ అల్మోరాలోని గగాస్ నది వంతెనపై ఓ పులి గట్టిగా అరుస్తూ సంచరించింది. ఆ వంతెన పైనుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ఫోన్లో బంధించాడు.