ETV Bharat / state

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా గిరిజన మహిళపై అత్యాచారం - అడ్డొచ్చిన భర్తపై దాడి చేసి మరీ - RAPE ON TRIBAL WOMAN IN SANGAREDDY

సంగారెడ్డి జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచారం - అడ్డుకోబోయిన భర్తపై దాడి - నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించిన పోలీసులు

WOMAN RAPE IN SANGAREDDY
Rape On Tribal Woman In Sangareddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 2:16 PM IST

Rape On Tribal Woman In Sangareddy : మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లలా మారిపోతున్నారు. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్​ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం తగ్గడం లేదు.

మహిళపై అత్యాచారం : తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఓ విద్యాపీఠం ఆవరణలో నిద్రించిన గిరిజన మహిళ (37)పై తమిళనాడుకు చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మెదక్‌ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు సంత్‌ సేవాలాల్‌ దర్శనానికి ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా తమ తండా నుంచి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గత శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు. రాత్రి కావడంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేసి ఆ ఆవరణలోని చెట్టుకింద నిద్రపోయారు. విద్యాపీఠంలో గుడి నిర్మిస్తుండగా పెయింటర్‌గా పని చేస్తున్న తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన మాథవన్‌ అనే యువకుడు నిద్రిస్తున్న మహిళపై కన్నేశాడు.

భర్తపై రాయితో దాడి చేసి : భర్త కళ్ల ముందే ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై రాయితో దాడి చేసి గాయపర్చాడు. దుండగుడి నుంచి తప్పించుకున్న అతను వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారించారు. పారిపోయిన నిందితుడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఠాణాకు తరలించి విచారించగా, నేరం ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.

మహిళల భద్రత : తెలంగాణలో మహిళల భద్రతకు అనేక చర్యలు చేపట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి 'షీ' టీమ్​లను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరించాయి. అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల భద్రత కోసం ఇన్ని చర్యలు చేపట్టినా ఎక్కడోచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్​లో బాలికపై అత్యాచారం - కేరళలో కేసు నమోదు - కట్​ చేస్తే పదేళ్ల జైలు శిక్ష

స్కూల్​లో దారుణం- 13ఏళ్ల స్టూడెంట్​పై టీచర్ల గ్యాంగ్ రేప్

Rape On Tribal Woman In Sangareddy : మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లలా మారిపోతున్నారు. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్​ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం తగ్గడం లేదు.

మహిళపై అత్యాచారం : తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఓ విద్యాపీఠం ఆవరణలో నిద్రించిన గిరిజన మహిళ (37)పై తమిళనాడుకు చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మెదక్‌ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు సంత్‌ సేవాలాల్‌ దర్శనానికి ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా తమ తండా నుంచి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గత శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు. రాత్రి కావడంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేసి ఆ ఆవరణలోని చెట్టుకింద నిద్రపోయారు. విద్యాపీఠంలో గుడి నిర్మిస్తుండగా పెయింటర్‌గా పని చేస్తున్న తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన మాథవన్‌ అనే యువకుడు నిద్రిస్తున్న మహిళపై కన్నేశాడు.

భర్తపై రాయితో దాడి చేసి : భర్త కళ్ల ముందే ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై రాయితో దాడి చేసి గాయపర్చాడు. దుండగుడి నుంచి తప్పించుకున్న అతను వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారించారు. పారిపోయిన నిందితుడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఠాణాకు తరలించి విచారించగా, నేరం ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.

మహిళల భద్రత : తెలంగాణలో మహిళల భద్రతకు అనేక చర్యలు చేపట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి 'షీ' టీమ్​లను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరించాయి. అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల భద్రత కోసం ఇన్ని చర్యలు చేపట్టినా ఎక్కడోచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్​లో బాలికపై అత్యాచారం - కేరళలో కేసు నమోదు - కట్​ చేస్తే పదేళ్ల జైలు శిక్ష

స్కూల్​లో దారుణం- 13ఏళ్ల స్టూడెంట్​పై టీచర్ల గ్యాంగ్ రేప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.