thumbnail

కిలోకు 800 గ్రాములే ఇస్తున్నారట - మాంసం ప్రియులారా కాస్త చూసుకొని తీసుకోండి

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 4:29 PM IST

Updated : Jan 7, 2024, 4:38 PM IST

Weights and Measures Department Raids On Markets : మాంసం విక్రయ దుకాణాలు, రైతు బజార్లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్​లోని పలుచోట్ల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత పలువురు వ్యాపారులపై 54 కేసులు నమోదు చేశారు. కొత్తపేట రైతుబజార్​, పరిసర ప్రాంతాల్లో సుమారు 19 మందిపై కేసులు నమోదయ్యాయి. వికారాబాద్​ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు. 

Raids On Markets in Hyderabad : తూకాల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసం వచ్చినట్లు తూనికలు, కొలతల అధికారులు గుర్తించారు. దుకాణదారులు కిలోకు 800 గ్రాముల మాంసం మాత్రమే ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పలు మాంసపు దుకాణాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్​ కంట్రోలర్​ జగన్మోహన్​ రెడ్డి నేతృత్వంలోని 20 మంది సభ్యల బృందం పాల్గొంది. హైదరాబాద్​ నగరంలోని ఉప్పల్​, కుషాయిగూడ, వికారాబాద్​ సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

Last Updated : Jan 7, 2024, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.