thumbnail

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 9:26 AM IST

ETV Bharat / Videos

Train Passing Over Woman : పైనుంచి వెళ్లిన గూడ్స్​ రైలు.. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డ మహిళ

Train Passing Over Woman Video : ఆగి ఉన్న రైలు కింది నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. ట్రాక్​పై ఇరుక్కుపోయింది. అనంతరం ఆకస్మాత్తుగా రైలు కదిలింది. కానీ లక్కీగా పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కర్ణాటక.. బెంగళూరు సమీపంలో రాజనుకుంటె రైల్వే స్టేషన్​లో జరిగింది.  

ఇదీ జరిగింది..
అడ్డగానహళ్లి గ్రామానికి చెందిన ఓ మహిళ.. యలహంక మండలంలోని రాజనుకుంటె రైల్వే స్టేషన్​కు వెళ్లాల్సి ఉంది. అయితే రైల్వే స్టేషన్​కు వెళ్లే క్రమంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు కింది నుంచి పట్టాలు దాటేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది. దీంతో అక్కడున్న వారు కేకలు వేయడం మొదలు పెట్టారు. పడుకోమని సూచించారు. వెంటనే అప్రమత్తమైన మహిళ.. రైలు వెళ్లేంతవరకు అక్కడే పడుకుని ప్రాణాలు కాపాడుకుంది. రైలు వెళ్లిన తర్వాత ఆమె కుమార్తె ఆ మహిళను కౌగిలించుకుని ఓదార్చింది. అయితే రాజనుకుంటె రైలు మార్గం రోజూ వందల రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అడ్డగానహళ్లి ప్రజలు రాజనుకుంటె వెళ్లాలంటే రైలు పట్టాలు దాటాలి. రైల్వేస్టేషన్‌లో నిత్యం రైళ్లు ఆగి ఉంటాయి. దీంతో అనివార్యంగా రైలు కింది నుంచి పట్టాలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.