అర్ధరాత్రి ముసుగు దొంగల హల్​చల్​.. ATMలను పెకిలించి లక్షలు చోరీ

By

Published : Jan 27, 2023, 3:58 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

అర్ధరాత్రి ముసుగు దొంగలు హల్​చల్​ చేశారు. బ్యాంక్​ ఆఫ్​ బరోడాకు చెందిన ఓ ఏటీఎమ్​లోకి ముసుగు ధరించిన కొందరు దుండగులు చొరబడ్డారు. అనంతరం ఆ ఏటీఎమ్​​ను పెకిలించారు. రూ.8 లక్షలు ఉన్న ఆ ఏటీఎమ్​ను ఎత్తుకెళ్లారు. 7 నుంచి 8 నిమిషాల్లో చోరీ పూర్తి చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్మేర్​ జిల్లా రూపన్​గఢ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సుర్సురా అనే గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ​య్యాయి. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  బ్యాంకు మేనేజర్​కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వాచ్​మ్యాన్​ లేకపోవడమే దొంగలకు అనుకూలించిందని పోలీసులు తెలిపారు. 

కొన్ని రోజుల క్రితం జరిగిన ఇదే తరహా ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరై గ్రామంలోని ఓ ఏటీఎమ్​లో దొంగలు పడి రూ. 31.60 లక్షలు ఉన్న ఏటీఎమ్​ను పెకిలించారు. అనంతరం దాన్ని ఓ వాహనంలో పెట్టి ఎత్తుకెళ్లారు. ఇదే కాకుండా గత డిసెంబర్​ బెహ్రోర్​లో ఓ ఏటీఎమ్​ను గ్యాస్​ కట్టర్​తో కట్​ చేసి రూ. 15 లక్షలు దోచుకుని పరారయ్యారు.  

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.