MP Komatireddy On Alliance With Left Parties : 'వామపక్షాలు 4 సీట్లు అడిగాయి.. పొత్తులపై ఇవాళ క్లారిటీ వస్తుంది.. రేపు రెండో జాబితా విడుదల' - రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థులపై కోమటి రెడ్డి
🎬 Watch Now: Feature Video


Published : Oct 25, 2023, 2:42 PM IST
MP Komatireddy On Alliance With Left Parties 2023 : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు అనేక మంది నేతలు కాంగ్రెస్లో చేరనున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80సీట్ల వరకు తమ పార్టీకి వచ్చే అవకాశం ఉందని దీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన పలువురు నేతలు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. "నా సోదరుడు చేరిక విషయం నాతో మాట్లాడలేదు. పార్టీలో చేరిక విషయమై అధిష్ఠానంతో మాట్లాడారు. రేపు రెండో విడత జాబితా విడుదల చేస్తాం. ఆరు స్థానాల్లో ఇబ్బందులున్నాయి. ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు. కాళేశ్వరంపై విచారణ జరపాలని గతంలోనే ప్రధానికి లేఖ రాశాను. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదు. మిర్యాలగూడ స్థానం కూడా వామపక్షాలు కోరాయి. మిర్యాలగూడలో ఓటు ఎంత మేర బదిలీ అవుతుందనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయి. పొత్తులపై సాయంత్రం స్పష్టత వస్తుంది. అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్లో చాలా మంది నేతలు చేరుతున్నారు." అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.