ఆవు మృతదేహాన్ని జేసీబీకి కట్టి.. రోడ్డుపై లాక్కెళ్లి..

By

Published : Sep 26, 2022, 5:23 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail
మధ్యప్రదేశ్​ సత్నాలో హృదయవిదారక ఘటన జరిగింది. పెప్టెక్​ సిటీ టౌన్​షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్లి.. ఖాళీ ప్రదేశంలో పడేశారు. ఈ ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరలైన ఈ వీడియో అధికారుల దృష్టి చేరింది. దీంతో జేసీబీ డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.