'నన్ను కాపాడండి యోగి బాబా- ఇకపై అలా చేయను' అంటూ పోలీసులకు లొంగిపోయిన గ్యాంగ్​స్టర్

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 5:46 PM IST

thumbnail

Cow Slaughter Culprit Surrendered To Police In UP : ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలోని సహస్వాన్ పోలీస్ స్టేషన్‌లో ఓ వింత సన్నివేశం కనిపించింది. గోవధ కేసులో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్​స్టర్​ వినూత్న రీతిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మెడలో ప్లకార్డు ధరించి నేరుగా పోలీసు స్టేషన్​కు చేరుకున్నాడు. ఆ ప్లకార్డుపై 'యోగి బాబా దయచేసి నన్ను రక్షించండి, ఇక నుంచి నేను గోహత్య చేయను' అంటూ రాసి ఉంది. దీనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ఇదీ సంగతి
ఖైర్‌పుర్ ఖైరతి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం గత కొంతకాలంగా గోహత్యకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిపై గోవధ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న గ్యాంగ్​స్టర్​ ఆలం పరారయ్యాడు. అతడి కోసం చాలాకాలంగా వెతుకుతున్నారు పోలీసులు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి మహ్మద్​ ఆలం మెడలో ప్లకార్డును ధరించి పోలీస్​ స్టేషన్​ ముందు హాజరయ్యాడు. గోవులను చంపినందుకు తాను లొంగిపోతానని పోలీసులను కోరాడు. ఇక నుంచి గోవధ చేయనని రాసుకొచ్చిన ప్లకార్డును అక్కడే ఉన్న పోలీసులకు చూపించాడు. ఇది గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం అతడిని అరెస్టు చేసి స్టేషన్​ లోపలకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్‌ఎస్​పీ ఓపీ సింగ్ ధ్రువీకరించారు. మహ్మద్​ ఆలంను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.