కొండాపూర్​లో సీబీఎన్‌ విజన్‌ 2047 ఫోరం లాంచ్ కార్యక్రమం - చంద్రబాబుకు పట్టాభిషేకం చేయాలని పిలుపు

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 6:58 AM IST

thumbnail

CBN Vision 2047 Forum Launch Program: ఇంటినైనా, రాష్ట్రానైనా తీర్చిదిద్దగల శక్తి మహిళలకు మాత్రమే ఉందని ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు. మహిళలంతా ఏకమై... ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు పట్టాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ కొండాపూర్‌ మినర్వా మైదానంలో ఏర్పాటు చేసిన సీబీఎన్ విజన్‌ 2047 ఫోరంను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi), మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చంద్రబాబు కోసం ఒక ఫోరం ఏర్పాటు చేసి.. దాని ద్వారా ఆయన ఆలోచనలు తెలియజేయడం గొప్ప విషయమని కొల్లు రవీంద్ర అన్నారు. 2019లో టీడీపీ ఓడిపోవడం దురదృష్టకరమని.. మరో అయిదేళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశానికి తలమానికంగా నిలిచేదని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను కాపాడారు. ఏపీ ప్రజలు మళ్లీ తప్పు చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌ మరో బిహార్‌గా మారే ప్రమాదముందని.. ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని.. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా చంద్రబాబు విజన్‌-2047 ప్రకటించారని కొల్లు రవీంద్ర అన్నారు.

చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. విజన్‌-2020తో ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జగన్‌ సాక్షి క్యాలెండర్‌ విడుదల చేశారన్న ఉండవల్లి శ్రీదేవి.. కేసులు పెట్టడం.. కూలగొట్టడమే జగన్‌ మోహన్ రెడ్డి పని అని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.