thumbnail

By

Published : Mar 30, 2023, 10:08 PM IST

ETV Bharat / Videos

నడిరోడ్డుపై కారు బీభత్సం.. అతివేగంతో 8 మందిని ఢీకొట్టి.. ఇద్దరి మృతికి కారణమై..

మధ్యప్రదేశ్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో రోడ్డు మీద వెళ్తూ.. ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందౌర్​లోని భన్వర్ కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమై కారు డ్రైవర్​ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేశారు. కొందరు స్థానికులు కారును తగలబెట్టేందుకు సైతం యత్నించారు.

గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కారు వేగంగా రావడం, ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడం వీడియోలో సృష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం.. ఉత్తరాఖండ్ రూర్కీలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు పక్కనే వెళ్తున్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఆ సమయంలో హరియాణా నుంచి ఓ బస్సు కారు వెనుకే వస్తుంది. అయితే ఆ బస్సు.. కారును ఢీకొట్టలేదు. దీంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరూ ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాకు చెందిన వారని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.