Brahmanandam Met CM KCR : సీఎం కేసీఆర్​ను కలిసిన బ్రహ్మానందం.. కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం

By

Published : Jul 29, 2023, 7:35 PM IST

thumbnail

Brahmanandam Invited CM KCR to his Son's Wedding : ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. కుటుంబ సమేతంగా ప్రగతి భవన్​కు వచ్చిన బ్రహ్మానందం.. హైదరాబాద్​లో త్వరలో జరగనున్న తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు కేసీఆర్​కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం తన స్వహస్తాలతో వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేసీఆర్​కు అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు బ్రహ్మానందంతో మాట్లాడిన కేసీఆర్.. కాబోయే వధూవరుల వివరాలతో పాటు సినిమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మానందం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సిద్ధార్థ్​ వివాహం ఐశ్వర్యతో జరగనుంది.

ఇక బ్రహ్మానందం వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గౌతమ్​ అందరికీ సుపరిచితుడు కాగా.. రెండో కుమారుడైన సిద్ధార్థ్​ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వృత్తిరీత్యా డాక్టర్​ అయిన సిద్ధార్థ్​ నిశ్చితార్థం.. డాక్టర్​ ఐశ్వర్యతో మే నెలలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.