Champions Trophy Team India : ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్గా టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. 2023లో వన్డే వరల్డ్కప్ చేజార్చుకున్న టీమ్ఇండియా, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీనైనా ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. గురువారం బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా హైలైట్స్, గణాంకాలపై ఓ లుక్కేద్దామా?
- ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ రెండుసార్లు విజేతగా నిలిచింది. 2002లో తొలిసారి సౌరభ్ గంగూలీ నాయకత్వంలో శ్రీలంకతో సంయుక్తంగా నెగ్గగా, 2013లో ధోనీ కెప్టెన్సీలో టైటిల్ దక్కించుకుంది
- ఈ టోర్నీలో 7ఎడిషన్లలో కలిపి భారత్ 29 మ్యాచ్లు ఆడింది. అందులో 18 విజయాలు ఉండగా, 8 మ్యాచ్ల్లో ఓడింది. మరో మూడింట్లో ఫలితం రాలేదు
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అత్యధిక స్కోరు 331-7 (50 ఓవర్లు). 2013 ఎడిషన్లో సౌతాఫ్రికాపై టీమ్ఇండియా ఈ స్కోర్ సాధించింది. ఇదే భారత్ హైయ్యెస్ట్ స్కోర్
- టీమ్ఇండియా అత్యల్ప స్కోరు 158-10 (30.3 ఓవర్లు). 2017 ఎడిషన్ ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది
- 2017లో పాకిస్థాన్ (గ్రూప్ స్టేజ్)పై భారత్ 158 పరుగుల తేడాతో నెగ్గింది. పరుగుల పరంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఇదే అతి పెద్ద విజయం
- అదే 2017 ఎడిషన్లో బంగ్లాదేశ్పై టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. వికెట్ల పరంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఇదే అతి పెద్ద విజయం
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శిఖర్ ధావన్ టాప్లో ఉన్నాడు. ధావన్ 10 మ్యాచ్ల్లో 701 పరుగులు చేశాడు
- అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరిట ఉంది. 2000లో గంగూలీ సౌతాఫ్రికాపై 141* పరుగులు బాదాడు. ఎక్కువ సిక్స్లు బాదింది కూడా గంగూలీనే. అతడు 17 సిక్స్లతో టాప్లో ఉన్నాడు
- ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రవీంద్ర జడేజా టాప్లో కొనసాగుతున్నాడు. జడ్డూ ఇప్పటివరకు 16 వికెట్లు నేలకూల్చాడు
- ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లుగా ధావన్, గంగూలీ ఉన్నారు. ఈ ఇద్దరూ చెరో 3 సెంచరీలు బాదారు
- కెప్టెన్గా ఎక్కువ మ్యాచ్లు నెగ్గిన రికార్డ్ కూడా గంగూలీ పేరిటే ఉంది. గంగూలీ 11మ్యాచ్ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించగా, 7సార్లు విజయం సాధించాడు
ఇక ఈసారి మూడో టైటిల్ వేటిలో రోహిత్ సేన బరిలో దిగనుంది. గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ (ఫిబ్రవరి 23), న్యూజిలాండ్ (మార్చి 02)ను ఢీకొట్టనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదిక దుబాయ్లో ఆడనుంది.
These pics from today 📸
— BCCI (@BCCI) February 17, 2025
How good 🤌🏻#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/yM50ArMIj5
ఛాంపియన్స్ ట్రోఫీ : ఎవరి బలం ఎంత?- ఎవరి ఛాన్స్లు ఎలా ఉన్నాయి?
ఛాంపియన్స్ ట్రోఫీలో హైయ్యెస్ట్ రన్స్ బాదిన బ్యాటర్స్ - రోహిత్, విరాట్ ఏ ప్లేస్లో ఉన్నారంటే?