thumbnail

ఉద్రిక్తతల మధ్య ట్రాన్స్​జెండర్ల ప్రైడ్​ పరేడ్​

By

Published : Jul 21, 2019, 11:45 AM IST

Updated : Jul 21, 2019, 11:54 AM IST

పోలాండ్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బియావిస్టాక్​​ నగరంలో ట్రాన్స్​జెండర్లు చేపట్టిన ప్రైడ్​ పరేడ్​ను అడ్డగించేందుకు పలువురు యత్నించారు. వారి నుంచి రక్షణ కల్పించేందుకు పరేడ్​కు పోలీసులు భారీ భద్రత కల్పించారు. సుమారు 500 మంది పోలీసులతో రక్షణ కవచం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసనకారులు పరేడ్​లో పాల్గొన్నవారి నుంచి జెండాలను లాక్కుని తగులబెట్టారు. ఎల్​జీబీటీల పరుగుకు ఆటంకం కలిగించిన పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల రక్షణలో ప్రైడ్​ పరేడ్​ను పూర్తి చేశారు ట్రాన్స్​జెండర్లు.
Last Updated : Jul 21, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.