ETV Bharat / state

30 నెలల్లో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి - హైదరాబాద్​లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లపై సీఎం రేవంత్​ సమీక్ష - CM REVANTH REVIEW ON NEW FLYOVERS

జీహెచ్‌ఎంసీలో ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష - వంతెనల నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం - మీరాలం చెరువు బ్రిడ్జి నిర్మాణం 30 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశం

CM Revanth Review On New Flyovers
CM Revanth Review On New Flyovers (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 10:04 PM IST

CM Revanth Reddy Review On New Flyovers : హైదరాబాద్​లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 90 రోజుల్లో డీపీఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని పలు ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై సుమారు రెండున్నర కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు మూడు ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు, చేర్పులు సూచించిన రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో పూర్తి సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు.

మీరాలం బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దండి : మీరాలం బ్రిడ్జిని హైదరాబాద్​లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్​లో రోడ్ల వెడల్పుపై కూడా పలు సూచనలు ఇచ్చారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి నదీ అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy Review On New Flyovers : హైదరాబాద్​లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 90 రోజుల్లో డీపీఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని పలు ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై సుమారు రెండున్నర కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు మూడు ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు, చేర్పులు సూచించిన రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో పూర్తి సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు.

మీరాలం బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దండి : మీరాలం బ్రిడ్జిని హైదరాబాద్​లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్​లో రోడ్ల వెడల్పుపై కూడా పలు సూచనలు ఇచ్చారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి నదీ అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా హైదరాబాద్ నగరాభివృద్ధి - ప్రత్యేకంగా అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు నిధి!

న్యూయార్క్‌, టోక్యో తరహాలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.