హిమపాతంతో పదుల సంఖ్యలో ప్రమాదానికి గురైన కార్లు

By

Published : Jan 19, 2021, 9:49 PM IST

thumbnail
జపాన్​లోని మియాగిలో భారీగా కురుస్తోన్న హిమపాతంతో జనజీవనం స్తంభించిపోయింది. మంచు వల్ల రోడ్డు కనిపించక జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకదాని వెనక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన కార్లు, ఇతర వాహనాలను రహదారి మీదనుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.