ఇజ్రాయెల్​ను ముంచెత్తిన వరదలు.. ఇద్దరు మృతి

By

Published : Jan 5, 2020, 9:45 AM IST

thumbnail
ఇజ్రాయెల్​ టెల్​ అవీవ్​ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని ఓ భవనంలో పార్కింగ్​ గ్యారేజ్​లోకి వరద నీరు చేరి ఇద్దరు మృతి చెందారు. లిఫ్ట్​లో కిందకు వెళ్లిన క్రమంలో వరద నీరు చేరి అందులోనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.