అంబులెన్స్ లేక.. ద్విచక్ర వాహనం దిక్కాయె.. - బైక్పై కరోనా రోగి
🎬 Watch Now: Feature Video
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఓ కరోనా రోగిని ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన కేరళ అలప్పుజ జిల్లాలో జరిగింది. పున్నప్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వందనం వైద్య కళాశాలకు రోగిని తరలించారు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ సదుపాయం లేదని.. అలాగే వైద్యుడు కూడా అందుబాటులో లేనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా పాలనాధికారి.. దర్యాప్తుకు ఆదేశించారు.