ఇలా నిరసన తెలిపే నాయకుణ్ని చూసుండరు! - ఛత్తీస్గఢ్
🎬 Watch Now: Feature Video

ఛత్తీస్గఢ్ రాయ్పుర్ బల్దియాలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగటం లేదని భాజపా కార్పొరేటర్ మనోజ్ ప్రజాపతి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని మురికి కాల్వ నుంచి మలినాన్ని సేకరించి బల్దియా సభలో చల్లారు. బల్దియా మునిసిపాలిటీని కాంగ్రెస్ పాలిస్తోంది. ఉద్దేశపూర్వకంగా భాజపా ఈ చర్య చేపట్టిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.