IRCTC Srisailam Tour Package: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఈ బ్రహ్మోత్సవాల వేళ స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా పరమ పవిత్రమైన శివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ప్రయాణం ఎప్పుడు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఐఆర్సీటీసీ టూరిజం "Highlights of Hyderabad with Srisailam" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇది మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం నుంచి గురువారం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్లో శ్రీశైలంతో పాటు హైదరాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణ వివరాలు :
- మొదటి రోజు సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులను పికప్ చేసుకుంటారు. అక్కడి నుంచి హోటల్కు తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. తిరిగి హోటల్కు చేరుకుని ఆ నైట్ సిటీలోనే స్టే చేస్తారు.
- రెండో రోజు ఉదయం 5 గంటలకు హోటల్ నుంచి శ్రీశైలం బయలుదేరుతారు. శ్రీశైలం చేరుకుని మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి స్థానిక ప్రదేశాలు చూసి హైదరాబాద్కు రిటర్న్ అవుతారు. ఆ రాత్రికి భాగ్యనగరంలో స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్ఫాస్ట్ అనంతరం రామోజీ ఫిల్మ్సిటీ విజిట్ ఉంటుంది. ఆ రోజంతా అక్కడ ఎంజాయ్ చేసి రాత్రికి హోటల్కు చేరుకుని అక్కడే స్టే చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం టిఫెన్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి బిర్లా మందిర్, గోల్కోండ కోట, కుతుబ్షాహి టూంబ్స్ విజిట్ చేస్తారు. అనంతరం తిరిగి సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లలో డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు ఇవే:
1 నుంచి 3 ప్రయాణికులకు: సింగిల్ షేరింగ్కు రూ.36,270, డబుల్ షేరింగ్కు రూ.19,070, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.14,570 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయినా, విత్ అవుట్ బెడ్ అయినా రూ.9,590, పే చేయాలి.
4 నుంచి 6 ప్రయాణికులకు: డబుల్ షేరింగ్కు రూ.15,110, ట్రిపుల్ షేరింగ్కు రూ.13,030 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయినా, విత్ అవుట్ బెడ్ అయినా రూ.9,590, పే చేయాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ఏసీ హోటల్ అకామిడేషన్
- డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్లు
- ప్యాకేజీని బట్టి ట్రాన్స్పోర్ట్ కోసం ఏసీ వెహికల్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 27 వరకు సూచించిన తేదీల్లో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
తక్కువ ధరలో షిరిడీ సాయి దర్శనం - హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!
హైదరాబాద్ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్లో కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ చూడొచ్చు!
ఒక్కరోజులోనే 'అరకు' అందాలన్నీ చూసేయండి - రూ.2 వేలకే IRCTC సూపర్ ప్యాకేజీ!