మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్​చల్

By

Published : Jan 22, 2022, 10:37 AM IST

thumbnail

Man Climbs Cell Tower: మద్యం తాగి మొబైల్ టవర్‌పైకి ఎక్కి సుమారు గంటన్నరపాటు హల్‌చల్ చేశాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిందీ ఘటన. 40 ఏళ్ల కైలాష్.. 50 అడుగుల ఎత్తైన టవర్‌ ఎక్కాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానికులు గంటన్నరపాటు బతిమాలితేగానీ కిందకురాలేదు. ఆ వ్యక్తి బాగా తాగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.