thumbnail

దిల్లీలో జనసమూహంపైకి దూసుకెళ్లిన కారు

By

Published : Sep 2, 2019, 7:08 PM IST

Updated : Sep 29, 2019, 5:00 AM IST

దేశ రాజధాని దిల్లీలో ఓ కారు విధ్వంసం సృష్టించింది. జనసమూహంపైకి దూసుకెళ్లి అక్కడున్న వారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. డ్రైవర్ చర్యతో ఆగ్రహించిన స్థానికులు కారుపై దాడి చేశారు. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కారును ద్వసం చేస్తుండగా..  అతివేగంతో కారు ముందుకు సాగింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి.  దిల్లీలోని మోడల్​ టౌన్ ప్రాంతం గుప్తా కాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Last Updated : Sep 29, 2019, 5:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.