యూపీ: 'పౌర' నిరసన హింసాత్మకం.. బాష్పవాయువు ప్రయోగం

By

Published : Dec 21, 2019, 5:30 PM IST

thumbnail
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లోని రాంపుర్​లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాంపుర్​ బంద్​కు పిలుపునిచ్చిన క్రమంలో 144 సెక్షన్​ ఆంక్షలను లెక్కచేయకుండా.. వీధుల్లోకి చేరిన 500 మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనలో 17మంది నిరనసకారులు సహా కొందరు పోలీసులూ గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.