Ananth Diamonds Inauguration Ceremony : మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరు సందర్భానికి తగ్గట్టు నగలను ఇష్టపడుతున్నారని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన అనంత్ డైమండ్స్ని శైలజా కిరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ కమిషనర్ రేఖా రాణి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అనంత్ డైమండ్స్ నిర్వాహకులు వెంకట భాను ప్రకాశ్, విష్ణు ప్రియ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నమ్మకం ముఖ్యం : అనంత్ డైమండ్స్లో కొలువుదీరిన వివిధ రకాల ఆభరణాలను శైలజా కిరణ్ ఆసక్తిగా తిలకించారు. నగల నాణ్యత, తయారీకి సంబంధించిన అంశాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వజ్రాల కొనుగోలు సమయంలో నమ్మకం అనేది ఎంతో ముఖ్యమైన అంశమని అన్నారు.
"అనంత్ డైమండ్స్ ఈరోజు ప్రారంభమైంది. వీరు గత 13 సంవత్సరాలుగా విజయవాడలో మంచి బంగారు, డైమండ్ ఆభరణాలను అందిస్తున్నారు. కొద్ది కాలంలోనే అనంత్ డైమండ్స్ చాలా ప్రసిద్ధిని సంపాదించింది. దీనికి కారణం వారి పనితనం. వీరి పనితనం చాలా గొప్పగా ఉంది" -శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ