ETV Bharat / bharat

'ఇకపై దివ్యాంగులందరూ స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చు'- సుప్రీం కోర్టు కీలక తీర్పు - SC ON PWD CANDIDATES SCRIBES

'ఇకపై వైకల్యం ఉన్నవారందరూ పరీక్షల్లో స్క్రైబ్​ సహాయం తీసుకోవచ్చు'- ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

SC On PWD candidates Scribes
SC On PWD candidates Scribes (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 7:04 PM IST

SC On PWD candidates Scribes : ఇకపై దివ్యాంగులు అందరూ స్క్రైబ్‌లను(సహాయకులను) పరీక్షలు రాయడానికి తీసుకువెళ్లవచ్చని సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బెంచ్‌మార్క్ వైకల్య (ప్రభుత్వ అధికారం జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం 40 శాతం నిర్దిష్ట వైకల్యం ఉన్న వ్యక్తి) ప్రమాణాలను పాటించకుండానే స్క్రైబ్​ సహాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

గుల్షన్​ కుమార్ అనే అభ్యర్థి తమకు స్క్రైబ్​, కంపెన్సేటరీ టైమ్​తో పాటు అన్ని సౌకర్యాలని కల్పించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్​ను జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్​ మహదేవన్​ ధర్మాసనం విచారించింది. అనంతరం కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలను రెండు నెలల్లో అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్రానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు

  • బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలి.
  • 2022 ఆగస్టు 10 నాటి ఆఫీస్ మెమోరాండంను కేంద్రం తిరిగి పరిశీలించాలి. ఆంక్షలను తొలగించి సహేతుకమైన పద్ధతిలో సడలింపులు ఇవ్వాలి.
  • అభ్యర్థులు కోర్టుల తలుపు తట్టే కంటే ముందు కేంద్రాన్ని సంప్రదించడానికి వీలుగా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్​ను ఏర్పాటు చేయాలి.
  • దరఖాస్తు చేసిన తర్వాత ఎక్కువ కాలం వేచి చూడకుండా ఉండేలా స్క్రైబ్ సర్టిఫికెట్​ చెల్లుబాటును పొడిగించాలి. ప్రస్తుతం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉంది.
  • అభ్యర్థులు స్క్రైబ్‌తో తమను తాము పరిచయం చేసుకోవడానికి పరీక్షకు ముందు కొంత సమయం ఇవ్వాలి.

ఈ మేరకు సవరించిన మార్పులతో కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని నియామక సంస్థలు, పరీక్షలు నిర్వహించే సంస్థలు, బోర్డులు పాటించాలని సూచించింది. క్రమానుగుణ సర్వేలు, వెరిఫికేషన్​తో ఈ మార్గదర్శకాలను పాటించాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

SC On PWD candidates Scribes : ఇకపై దివ్యాంగులు అందరూ స్క్రైబ్‌లను(సహాయకులను) పరీక్షలు రాయడానికి తీసుకువెళ్లవచ్చని సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బెంచ్‌మార్క్ వైకల్య (ప్రభుత్వ అధికారం జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం 40 శాతం నిర్దిష్ట వైకల్యం ఉన్న వ్యక్తి) ప్రమాణాలను పాటించకుండానే స్క్రైబ్​ సహాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

గుల్షన్​ కుమార్ అనే అభ్యర్థి తమకు స్క్రైబ్​, కంపెన్సేటరీ టైమ్​తో పాటు అన్ని సౌకర్యాలని కల్పించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్​ను జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్​ మహదేవన్​ ధర్మాసనం విచారించింది. అనంతరం కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలను రెండు నెలల్లో అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్రానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు

  • బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలి.
  • 2022 ఆగస్టు 10 నాటి ఆఫీస్ మెమోరాండంను కేంద్రం తిరిగి పరిశీలించాలి. ఆంక్షలను తొలగించి సహేతుకమైన పద్ధతిలో సడలింపులు ఇవ్వాలి.
  • అభ్యర్థులు కోర్టుల తలుపు తట్టే కంటే ముందు కేంద్రాన్ని సంప్రదించడానికి వీలుగా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్​ను ఏర్పాటు చేయాలి.
  • దరఖాస్తు చేసిన తర్వాత ఎక్కువ కాలం వేచి చూడకుండా ఉండేలా స్క్రైబ్ సర్టిఫికెట్​ చెల్లుబాటును పొడిగించాలి. ప్రస్తుతం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉంది.
  • అభ్యర్థులు స్క్రైబ్‌తో తమను తాము పరిచయం చేసుకోవడానికి పరీక్షకు ముందు కొంత సమయం ఇవ్వాలి.

ఈ మేరకు సవరించిన మార్పులతో కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని నియామక సంస్థలు, పరీక్షలు నిర్వహించే సంస్థలు, బోర్డులు పాటించాలని సూచించింది. క్రమానుగుణ సర్వేలు, వెరిఫికేషన్​తో ఈ మార్గదర్శకాలను పాటించాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.