'ఆధార్'​ కోసం రక్షణమంత్రి కాన్వాయ్​కు అడ్డం! - రక్షణమంత్రి కాన్వాయ్​కు అడ్డంగా వచ్చిన వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2019, 3:12 PM IST

రక్షణమంత్రి కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటు సమీపంలోని రోడ్డుపై రాజ్​నాథ్​ సింగ్​ వాహనశ్రేణి వస్తోన్న సమయంలో  అడ్డంగా పడుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. వెంటనే స్పందించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఉత్తర్​ప్రదేశ్​ ఖుషీనగర్​కు చెందిన 35 ఏళ్ల విశంభర్​ దాస్​ గుప్తాగా పోలీసులు గుర్తించారు. ఆధార్​ కార్డులో పేరు మార్పు కోసం ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు ఆ వ్యక్తి. విశంభర్​ దాస్​ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.