కరోనా నివారణకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బొమ్మలరామారం మండలం గోవింద్తండాకు చెందిన నలుగురు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. తండాకు చెందిన గర్భిణీని ఈ నెల 22న చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తిరుగుప్రయాణంలో 102 వాహనంలో ఇంటికి తీసుకువచ్చారు.
సంబంధిత అంబులెన్స్ డ్రైవర్కు నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది. వాహనంలో ప్రయాణించిన వారికి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. మండల ప్రజలెవరూ కరోనా విషయంలో ఆందోళనకు గురికావద్దని ఎస్సై మధుబాబు సూచించారు. లాక్డౌన్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.
ఇదీ చూడండి: ఇర్ఫాన్ఖాన్కు సైకత శిల్పంతో ఘననివాళి