ETV Bharat / state

' సీఎం కేసీఆర్​ వెంటే తెలంగాణ సమాజం' - Agriculture Minister Niranjan Reddy respond about huzurnagar byelection results 2019

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో తెరాస విజయం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Minister Niranjan Reddy respond about huzurnagar byelection results 2019
author img

By

Published : Oct 24, 2019, 4:34 PM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టడం చూస్తే... తెలంగాణ సమాజం ఎప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉందని మరోసారి తేటతెల్లమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు. ఈ విషయం పదే పదే రుజువవుతున్నా... విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం, కేసీఆర్‌పై అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న విపక్ష నేతల ప్రయత్నాలకు... ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టడం చూస్తే... తెలంగాణ సమాజం ఎప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉందని మరోసారి తేటతెల్లమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు. ఈ విషయం పదే పదే రుజువవుతున్నా... విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం, కేసీఆర్‌పై అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న విపక్ష నేతల ప్రయత్నాలకు... ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

24-10-2019 TG_HYD_14_24_MINISTER_ON_HUZURNAGAR_POLL_RESULT_DRY_3038200 REPORTER : MALLIK.B ( ) సూర్యాపేట హుజూర్‌నగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నిక ఫలితం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో తెరాసకు పట్టం గట్టడం చూస్తే... తెలంగాణ సమాజం ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉందని మరోసారి తేటతెల్లమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం పదే పదే రుజువవుతున్నా... విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం, కేసీఆర్‌పై అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న విపక్ష నేతల ప్రయత్నాలకు ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయినా అవే స్థాయి మరచిన విమర్శలు, అవే వక్రభాష్యాలు, అవే సంస్కారహీన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు పాఠం నేర్చుకోని నాయకులు... ఇప్పుడు కూడా గుఠపాఠం నేర్చుకుంటారని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. DRY............

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.