ETV Bharat / state

'మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్‌కు నెలాకరుకల్లా సర్వే పనులు పూర్తి' - MEDCHAL METRO CORRIDOR SURVEY WORK

మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్‌కు సర్వే పనులు - ఈనెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు పూర్తి చేస్తామన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

Medchal Metro Corridor Survey Work
Medchal Metro Corridor Survey Work (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 7:44 PM IST

Survey Work For The Metro Corridor In Medchal And Shamirpet Areas : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఈ రూట్​లో ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ మార్గం డీపీఆర్​లను సిద్దం చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్​లు సిద్దం అవుతాయని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డీపీఆర్​లను మెట్రో అధికారులు మొదట రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం సమర్పిస్తారు. అనంతరం ఆ డీపీఆర్​లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.

అనేక అంశాలు పరిశీలిస్తాం : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో జోరుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఈనెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసమార్థ్య పరీక్షలు పూర్తవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ), జేబీఎస్ నుండి శామీర్ పేట్ (21 కి.మీ) మెట్రో కారిడార్​లకు డీపీఆర్​ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. డీపీఆర్ ల తయారీకి ముఖ్యంగా మూడు రకాలైన అధ్యయనాలు అవసరమవుతాయన్నారు. అవి ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు (జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్), పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అని ఆయన వెల్లడించారు.

ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్​లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్​లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి : ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయవలసి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భూసామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూసామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని అన్నారు.

సామాన్యంగా ప్రతి అర కిలోమీటర్​కి ఒక బోర్ హోల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోందని, ఒక్కొక్క బోర్ హోల్​ను యాభై నుంచి వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, ఏ స్థాయిలో భూమి గట్టి తనంగానీ, రాతి పొరలు తగులుతాయో పరిశీలిస్తామని మెట్రో ఎండీ చెప్పారు. ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూసామర్థ్య అధ్యయనాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు మెట్రో సంస్థ జేబీఎస్ - మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ - శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల ఈ భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని అన్నారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరు వరకు మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లతో పాటు, శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్​లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్​లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.

మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్​న్యూస్ - త్వరలో టికెట్ ఛార్జీల పెంపు!

హైదరాబాద్​ పాతబస్తీకి మెట్రో విస్తరణ - హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

Survey Work For The Metro Corridor In Medchal And Shamirpet Areas : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఈ రూట్​లో ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ మార్గం డీపీఆర్​లను సిద్దం చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్​లు సిద్దం అవుతాయని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డీపీఆర్​లను మెట్రో అధికారులు మొదట రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం సమర్పిస్తారు. అనంతరం ఆ డీపీఆర్​లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.

అనేక అంశాలు పరిశీలిస్తాం : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో జోరుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఈనెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసమార్థ్య పరీక్షలు పూర్తవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ), జేబీఎస్ నుండి శామీర్ పేట్ (21 కి.మీ) మెట్రో కారిడార్​లకు డీపీఆర్​ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. డీపీఆర్ ల తయారీకి ముఖ్యంగా మూడు రకాలైన అధ్యయనాలు అవసరమవుతాయన్నారు. అవి ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు (జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్), పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అని ఆయన వెల్లడించారు.

ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్​లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్​లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి : ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయవలసి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భూసామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూసామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని అన్నారు.

సామాన్యంగా ప్రతి అర కిలోమీటర్​కి ఒక బోర్ హోల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోందని, ఒక్కొక్క బోర్ హోల్​ను యాభై నుంచి వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, ఏ స్థాయిలో భూమి గట్టి తనంగానీ, రాతి పొరలు తగులుతాయో పరిశీలిస్తామని మెట్రో ఎండీ చెప్పారు. ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూసామర్థ్య అధ్యయనాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు మెట్రో సంస్థ జేబీఎస్ - మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ - శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల ఈ భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని అన్నారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరు వరకు మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లతో పాటు, శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్​లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్​లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.

మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్​న్యూస్ - త్వరలో టికెట్ ఛార్జీల పెంపు!

హైదరాబాద్​ పాతబస్తీకి మెట్రో విస్తరణ - హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.