ETV Bharat / sports

విరాట్, ధోనీ ఫ్యాన్స్​కు షాక్- ఉప్పల్​లో RCB, CSKమ్యాచ్​లు లేవుగా- ఆ ఛాన్స్ వస్తే లక్కీనే! - IPL 2025

తెలుగు రాష్ట్రాల్లోని ఆర్సీబీ, చెన్నై ఫ్యాన్స్​కు షాక్- ఈసారి ఉప్పల్​లో ఆ మ్యాచ్​లు లేవు!

No matches with RCB and CHENNAI
IPL 2025 (Getty Images, AP)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 16, 2025, 7:39 PM IST

IPL 2025 Uppal Stadium Matches : 2025 ఐపీఎల్​ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ జరగనుంది. 65 రోజులపాటు క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఈ క్యాష్ రిచ్ లీగ్ రెడీ అవుతోంది. మొత్తం 74 మ్యాచ్​లు 13 వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్​ స్టేడియం 9 మ్యాచ్​లకు వేదిక కానుంది.

ఉప్పల్​లో స్టేడియంలో మ్యాచ్ అంటే స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా ఉప్పల్​లో ముంబయి, బెంగళూరు, చెన్నై జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే మాత్రం స్టేడియం కిక్కిరిసిపోతుంది. మిగతా మ్యాచ్​లతో పోలిస్తే, సన్​రైజర్స్​ ఈ మూడు జట్లతో ఆడే మ్యాచ్​లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ​టీమ్ఇండియా స్టార్లు రోహిత్ శర్మ (ముంబయి), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (చెన్నై) ఈ జట్లకు ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్టార్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు.

ఈసారి కూడా అలాగే స్టేడియానికి వెళ్లి తమ అభిమాన క్రికెటర్​లను లైవ్​లో చూసేందుకు క్రికెట్ లవర్స్​ ప్లాన్​ వేసేస్తున్నారు. కానీ, షెడ్యూల్​ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఆర్సీబీ, చెన్నై ఫ్యాన్స్​కు మాత్రం షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే, ఈ సీజన్​లో బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్​లు హైదరాబాద్​లో లేవు. దీంతో తమ ఫేవరెట్ స్టార్లు విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (సీఎస్కే)ను లైవ్​లో చూసే ఛాన్స్ మిస్​ అయ్యారు.

అలా జరిగితే లక్కీ ఛాన్స్!
ఈ ఎడిషన్​లో ఉప్పల్​లో 9 మ్యాచ్​లు జరగనున్నాయి. అందులో 7 లీగ్​ మ్యాచ్​లు కాగా, 2 క్వాలిఫైయర్​ మ్యాచ్​లు. మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్​లకు ఉప్పల్ వేదిక కానుంది. అయితే ఆర్సీబీ, చెన్నై జట్లు లీగ్​ దశలో టాప్- 4లో నిలిస్తే మాత్రం హైదరాబాద్​లో ఓ మ్యాచ్ ఆడతాయి. అప్పుడు ఈ జట్ల అభిమానులు తమ ఫేవరెట్ స్టార్లను లైవ్​లో చూసే ఛాన్స్ వస్తుంది. చూడాలి మరి ఈసారి టాప్- 4లో నిలిచే జట్లు ఏవో?

65 రోజులకు ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్! - SRH ఫస్ట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

రూ.4.8 కోట్ల ప్లేయర్​కు రిప్లేస్​మెంట్- ముంబయిలోకి కొత్త స్పిన్నర్!

IPL 2025 Uppal Stadium Matches : 2025 ఐపీఎల్​ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ జరగనుంది. 65 రోజులపాటు క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఈ క్యాష్ రిచ్ లీగ్ రెడీ అవుతోంది. మొత్తం 74 మ్యాచ్​లు 13 వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్​ స్టేడియం 9 మ్యాచ్​లకు వేదిక కానుంది.

ఉప్పల్​లో స్టేడియంలో మ్యాచ్ అంటే స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా ఉప్పల్​లో ముంబయి, బెంగళూరు, చెన్నై జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే మాత్రం స్టేడియం కిక్కిరిసిపోతుంది. మిగతా మ్యాచ్​లతో పోలిస్తే, సన్​రైజర్స్​ ఈ మూడు జట్లతో ఆడే మ్యాచ్​లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ​టీమ్ఇండియా స్టార్లు రోహిత్ శర్మ (ముంబయి), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (చెన్నై) ఈ జట్లకు ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్టార్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు.

ఈసారి కూడా అలాగే స్టేడియానికి వెళ్లి తమ అభిమాన క్రికెటర్​లను లైవ్​లో చూసేందుకు క్రికెట్ లవర్స్​ ప్లాన్​ వేసేస్తున్నారు. కానీ, షెడ్యూల్​ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఆర్సీబీ, చెన్నై ఫ్యాన్స్​కు మాత్రం షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే, ఈ సీజన్​లో బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్​లు హైదరాబాద్​లో లేవు. దీంతో తమ ఫేవరెట్ స్టార్లు విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (సీఎస్కే)ను లైవ్​లో చూసే ఛాన్స్ మిస్​ అయ్యారు.

అలా జరిగితే లక్కీ ఛాన్స్!
ఈ ఎడిషన్​లో ఉప్పల్​లో 9 మ్యాచ్​లు జరగనున్నాయి. అందులో 7 లీగ్​ మ్యాచ్​లు కాగా, 2 క్వాలిఫైయర్​ మ్యాచ్​లు. మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్​లకు ఉప్పల్ వేదిక కానుంది. అయితే ఆర్సీబీ, చెన్నై జట్లు లీగ్​ దశలో టాప్- 4లో నిలిస్తే మాత్రం హైదరాబాద్​లో ఓ మ్యాచ్ ఆడతాయి. అప్పుడు ఈ జట్ల అభిమానులు తమ ఫేవరెట్ స్టార్లను లైవ్​లో చూసే ఛాన్స్ వస్తుంది. చూడాలి మరి ఈసారి టాప్- 4లో నిలిచే జట్లు ఏవో?

65 రోజులకు ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్! - SRH ఫస్ట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

రూ.4.8 కోట్ల ప్లేయర్​కు రిప్లేస్​మెంట్- ముంబయిలోకి కొత్త స్పిన్నర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.