Bail to shilpa chowdary: మహిళలకు మాయమాటలు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరికి మిగిలిన రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్ రావడంతో రేపు చంచల్గూడ జైలు నుంచి ఆమె విడుదల కానున్నారు. అయితే రాజేంద్రనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులో శిల్ప చౌదరికి ఇదివరకే ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆమెపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. పలుసార్లు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు.
- ఇదీ చూడండి:
- Shilpa Chowdary Cheating Case: ముగిసిన శిల్పా చౌదరి కస్టడీ... ఆమె బ్యాంకు లాకర్లలో ఏమున్నాయంటే..!
- Shilpa Chowdary Custody news : 'కోట్ల రూపాయలను ఎక్కడకు మళ్లించారు?'
- Shilpa chowdary cheating case: శిల్పా చౌదరి కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్
- Shilpa Chowdary Police Custody: రూ.7కోట్లు తిరిగిచ్చేస్తా.. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి