ETV Bharat / sports

కుంభ్​మేళాలో గంగా హారతి, ప్రత్యేక పూజలు- చిన్నారుల స్పెషల్ విషెస్- భారత్ x పాక్ మ్యాచ్​ ఫీవర్​ - IND VS PAK 2025

భారత్ x పాకిస్థాన్ మ్యాచ్- టీమ్ఇండియా కోసం క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు

Ind vs Pak
Ind vs Pak (Source : AFP, PTI, ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 23, 2025, 12:46 PM IST

Ind vs Pak 2025 : దేశవ్యాప్తంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. యావత్ ప్రపంచం ఈ హై వోల్టేజ్ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్​కోసం భారీ ఎత్తున ప్రేక్షకులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు.

మహాకుంభ్​లో ప్రత్యేక పూజలు : ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని గంగా నది ఒడ్డున టీమ్ఇండియా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మ్యాచ్​లో భారత్ నెగ్గాలని ఆశించారు. ఇక వారణాసి, బిహార్​లో పలువురు ఫ్యాన్స్ ప్రత్యేక హోమం నిర్వహించారు. క్రికెటర్ల ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.

బుల్లి క్రికెట్ ఫ్యాన్స్​ విషెస్: వారణాసిలో చిన్నారులు టీమ్ఇండియాకు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. 'జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా. ఆల్​ ది బెస్ట్ ఇండియా అంటూ' బుజ్జి క్రికెట్ ఫ్యాన్స్​ హుషారుగా టీమ్ఇండియాను విష్ చేశారు. 2017 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​కు ప్రతీకారం తీర్చుకోవాలని అకాంక్షించారు. 'రోహిత్', 'విరాట్' అంటూ నినాదాలు చేశారు.

జనాన్ల శుభాకాంక్షలు : హై వోల్టేజ్​ మ్యాచ్​లో టీమ్ఇండియాకు భారత ఆర్మీ జవాన్లు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. 'ఇండియా జీతేగా', 'చక్​ దే ఇండియా' అంటూ హుషారుగా ఛీర్స్ చెప్పారు.

టీమ్ఇండియా కోసం ప్రత్యేక పూజలు, హోమాలు (Source : ETV Bharat)

Ind vs Pak 2025 : దేశవ్యాప్తంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. యావత్ ప్రపంచం ఈ హై వోల్టేజ్ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్​కోసం భారీ ఎత్తున ప్రేక్షకులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు.

మహాకుంభ్​లో ప్రత్యేక పూజలు : ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని గంగా నది ఒడ్డున టీమ్ఇండియా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మ్యాచ్​లో భారత్ నెగ్గాలని ఆశించారు. ఇక వారణాసి, బిహార్​లో పలువురు ఫ్యాన్స్ ప్రత్యేక హోమం నిర్వహించారు. క్రికెటర్ల ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.

బుల్లి క్రికెట్ ఫ్యాన్స్​ విషెస్: వారణాసిలో చిన్నారులు టీమ్ఇండియాకు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. 'జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా. ఆల్​ ది బెస్ట్ ఇండియా అంటూ' బుజ్జి క్రికెట్ ఫ్యాన్స్​ హుషారుగా టీమ్ఇండియాను విష్ చేశారు. 2017 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​కు ప్రతీకారం తీర్చుకోవాలని అకాంక్షించారు. 'రోహిత్', 'విరాట్' అంటూ నినాదాలు చేశారు.

జనాన్ల శుభాకాంక్షలు : హై వోల్టేజ్​ మ్యాచ్​లో టీమ్ఇండియాకు భారత ఆర్మీ జవాన్లు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. 'ఇండియా జీతేగా', 'చక్​ దే ఇండియా' అంటూ హుషారుగా ఛీర్స్ చెప్పారు.

టీమ్ఇండియా కోసం ప్రత్యేక పూజలు, హోమాలు (Source : ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.