ETV Bharat / state

నేలపైనే బాలింతలు..

author img

By

Published : Feb 15, 2019, 8:40 PM IST

ప్రభుత్వ ఆస్పత్రులు అసౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. చేవెళ్లలో కు.ని శస్త్ర చికిత్సలకు వచ్చిన బాలింతలకు సరైన సౌకర్యాలు కల్పించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యం

సౌకర్యాలు లేమితో బాలింతలు బాధలు
ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు. కటిక నేలపైనే బాలింతలు..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో కనిపించిన దృశ్యాలివి. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న బాలింతల పరిస్థితి వర్ణణాతీతం. బాధితులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు.
undefined
శుక్రవారం ఒక్కరోజే 140 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. కేవలం 30 మంచాలు మాత్రమే అందుబాటులో ఉండగా... అవీ ఇద్దరి, ముగ్గురు చొప్పున 60 మందికి కేటాయించారు. మిగతావారిని నేలపైనే పడుకోబెట్టారు. నొప్పి భరించలేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, సరైన ఏర్పాట్లు చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



సౌకర్యాలు లేమితో బాలింతలు బాధలు
ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు. కటిక నేలపైనే బాలింతలు..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో కనిపించిన దృశ్యాలివి. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న బాలింతల పరిస్థితి వర్ణణాతీతం. బాధితులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు.
undefined
శుక్రవారం ఒక్కరోజే 140 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. కేవలం 30 మంచాలు మాత్రమే అందుబాటులో ఉండగా... అవీ ఇద్దరి, ముగ్గురు చొప్పున 60 మందికి కేటాయించారు. మిగతావారిని నేలపైనే పడుకోబెట్టారు. నొప్పి భరించలేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, సరైన ఏర్పాట్లు చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



Intro:tg_nzb_06_15_kaarya_shaala_avb_c11
( ). వృక్షశాస్త్రం, జీవసాంకేతిక శాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో టెక్నిక్స్ ఇన్ బయోటెక్నాలజీ అనే అంశం పై కార్యశాల నిర్వహించారు.
నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యశాలలో హైదరాబాద్ ప్రైమర్ బయోటెక్ సంస్థ కు చెందిన శాస్త్రవేత్తలు రాజేష్, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్ లు హాజరై.. పి సి ఆర్ సహకారంతో ఎలక్ట్రో పోరోసిస్ పత్ర నమూనా నుండి డీఎన్ఏ వేరు చేయుట గురించి ప్రయోగ పద్ధతులను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు 8 బృందాలుగా విడిపోయి స్వయంగా ప్రయోగ పద్ధతులను నేర్చుకున్నారు. ఈ సందర్భంగా గిరిరాజ్ కళాశాల వృక్షశాస్త్ర అధిపతి లత మాట్లాడుతూ.. నిజామాబాద్ వంటి గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు సాంకేతిక అంశాలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలగడం అభినందనీయమన్నారు.
byte. శ్రావ్య పీజీ విద్యార్థిని
byte. లత గిరిరాజ్ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి


Body:నిజామాబాద్ అర్బన్


Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.