నిర్మల్ జిల్లా మామడ మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మహ్మద్ హయజ్కు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య, కుమారునికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి కోరుట్లకు తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: బయటపడ్డ నకిలీ ఫార్మా బిల్లుల భారీ కుంభకోణం