ETV Bharat / state

'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'

ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట పీఆర్​టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తక్షణమే బదిలీలతో కూడిన ప్రమోషన్లు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

author img

By

Published : Feb 9, 2021, 6:47 PM IST

prtuts staged a protest in front of the Mulugu District Collector's Office
'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'

33 నెలలుగా పెండింగ్​లో ఉన్న పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని పీఆర్​టీయూటీఎస్ డిమాండ్​ చేసింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులతో కలిసి నిరసన చేపట్టింది. 45శాతం ఫిట్​మెంట్​ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల విద్యావ్యవస్థ 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా' తయారైందని నాయకులు విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

33 నెలలుగా పెండింగ్​లో ఉన్న పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని పీఆర్​టీయూటీఎస్ డిమాండ్​ చేసింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులతో కలిసి నిరసన చేపట్టింది. 45శాతం ఫిట్​మెంట్​ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల విద్యావ్యవస్థ 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా' తయారైందని నాయకులు విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొత్త పార్టీలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్: షబ్బీర్‌ అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.