ETV Bharat / bharat

తండ్రీ కొడుకుల కుంభమేళా యాత్ర- బైక్​పైనే 3వేల కి.మీ జర్నీ - FATHER SON BIKE RIDE TO MAHA KUMBH

కుంభమేళాకు తండ్రిని బైక్​పై తీసుకెళ్లిన కుమారుడు- పుణ్యస్నానాలు చేసి సురక్షితంగా ఇంటికి చేరుకున్న తండ్రీకొడుకులు

Father Son Bike Ride To Maha Kumbh
Father Son Bike Ride To Maha Kumbh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 10:49 AM IST

Father Son Bike Ride To Maha Kumbh : కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని బైక్​పై ప్రయాగ్​రాజ్ కుంభమేళాకు తీసుకెళ్లాడు. త్రివేణి సంగమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ పుణ్య స్నానమాచరించి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ప్రయాణం సమయంలో తండ్రీకొడుకులు రాత్రివేళ పెట్రోల్ బంకుల వద్ద టెంట్లు వేసుకుని బస చేశారు. ఉదయాన్ని బైక్​పై ప్రయాణాన్ని సాగించారు.

3వేల కి.మీ ప్రయాణించి కుంభమేళాకు
ఉడుపి జిల్లాలోని శిర్వాకు చెందిన ప్రజ్వల్ షెనాయ్(25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్(52)తో కలిసి బైక్​పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు మహాకుంభమేళాకు బయలుదేరాడు. శిర్వ నుంచి బయలుదేరి యల్లాపూర్, హుబ్బళ్లి మీదుగా విజయపుర, షోలాపుర్, లాతూర్, నాందేడ్, నాగ్​పుర్, జబల్​పుర్ మీదుగా బైక్​పై 3,000 కి.మీ ప్రయాణించి ప్రయాగ్​రాజ్ చేరుకున్నారు. ఫిబ్రవరి 10న త్రివేణి సంగమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ పవిత్ర స్నానం చేసి ఫిబ్రవరి 13కి స్వగ్రామానికి మళ్లీ తిరిగి వచ్చేశారు.

'భారీగా ట్రాఫిక్ జామ్- కానీ బైక్​కు అనుమతి'
తాము ప్రయాగ్​రాజ్ చేరుకునేసరికి దాదాపు 250-300 కి.మీల దూరం ట్రాఫిక్ జామ్ అయ్యిందని ప్రజ్వల్ షెనాయ్ ఈటీవీ భారత్​కు తెలిపాడు. అయితే బైక్​ను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని పేర్కొన్నాడు. "పుణ్య స్నానాలు చేసే ప్రదేశంలో రద్దీ లేదు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో కొందరు మమ్మల్ని ఆపి మాట్లాడేవారు. మధ్యప్రదేశ్​లోని సియోని సమీపంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి మా బైక్​ను ఆపారు. తన ఖరీదైన కూల్ గ్లాసెస్, స్వీట్లు, కూల్ డ్రింక్స్, పండ్లు, ఇచ్చారు. అక్కడి పోలీసులు కూడా మాకు సహకరించారు. " అని ప్రజ్వల్ షెనాయ్ తెలిపాడు.

'రూ.20 వేలు ఖర్చు'

"144ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు నా కొడుకుతో కలిసి బైక్​పై వెళ్లడం గర్వంగా ఉంది. ఈ ప్రయాణానికి మాకు కేవలం రూ. 20,000 ఖర్చు అయ్యింది. మార్గమధ్యలో ఓ వ్యక్తి నా కుమారుడికి కొత్త హెల్మెట్​ను బహుమతిగా ఇచ్చాడు."
-- రాజేంద్ర షెనాయ్


తన భర్త, కొడుకుకి బస్సులో ప్రయాణించడం అలవాటు లేదని ప్రజ్వల్ తల్లి రజనీ తెలిపారు. "మాకు కారు లేదు. నా భర్త, కొడుకు బైక్ పై ప్రయాణాలు చేస్తారు. కొంత డబ్బును ఆదా చేసి ప్రయాగ్​రాజ్ వెళ్లమని వారికి ఇచ్చాను. నా కొడుకు, భర్త కుంభమేళాకు వెళ్లినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. " అని రజనీ పేర్కొన్నారు.
గతంలోనూ బైక్ యాత్ర
గతేడాది జూన్ లో తండ్రీకొడులిద్దరూ బైక్​పై హరియాణా, పంజాబ్, హిమాచల్​ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లేహ్-లద్ధాఖ్, కార్గిల్, మనాలి గుండా 10 రోజుల్లో 2,100 కి.మీ ప్రయాణించారు. సముద్ర మట్టానికి 17,982 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరమైన ఖార్దుంగ్లాపై కన్నడ జెండాను ఎగురవేశారు.

Father Son Bike Ride To Maha Kumbh : కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని బైక్​పై ప్రయాగ్​రాజ్ కుంభమేళాకు తీసుకెళ్లాడు. త్రివేణి సంగమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ పుణ్య స్నానమాచరించి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ప్రయాణం సమయంలో తండ్రీకొడుకులు రాత్రివేళ పెట్రోల్ బంకుల వద్ద టెంట్లు వేసుకుని బస చేశారు. ఉదయాన్ని బైక్​పై ప్రయాణాన్ని సాగించారు.

3వేల కి.మీ ప్రయాణించి కుంభమేళాకు
ఉడుపి జిల్లాలోని శిర్వాకు చెందిన ప్రజ్వల్ షెనాయ్(25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్(52)తో కలిసి బైక్​పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు మహాకుంభమేళాకు బయలుదేరాడు. శిర్వ నుంచి బయలుదేరి యల్లాపూర్, హుబ్బళ్లి మీదుగా విజయపుర, షోలాపుర్, లాతూర్, నాందేడ్, నాగ్​పుర్, జబల్​పుర్ మీదుగా బైక్​పై 3,000 కి.మీ ప్రయాణించి ప్రయాగ్​రాజ్ చేరుకున్నారు. ఫిబ్రవరి 10న త్రివేణి సంగమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ పవిత్ర స్నానం చేసి ఫిబ్రవరి 13కి స్వగ్రామానికి మళ్లీ తిరిగి వచ్చేశారు.

'భారీగా ట్రాఫిక్ జామ్- కానీ బైక్​కు అనుమతి'
తాము ప్రయాగ్​రాజ్ చేరుకునేసరికి దాదాపు 250-300 కి.మీల దూరం ట్రాఫిక్ జామ్ అయ్యిందని ప్రజ్వల్ షెనాయ్ ఈటీవీ భారత్​కు తెలిపాడు. అయితే బైక్​ను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని పేర్కొన్నాడు. "పుణ్య స్నానాలు చేసే ప్రదేశంలో రద్దీ లేదు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో కొందరు మమ్మల్ని ఆపి మాట్లాడేవారు. మధ్యప్రదేశ్​లోని సియోని సమీపంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి మా బైక్​ను ఆపారు. తన ఖరీదైన కూల్ గ్లాసెస్, స్వీట్లు, కూల్ డ్రింక్స్, పండ్లు, ఇచ్చారు. అక్కడి పోలీసులు కూడా మాకు సహకరించారు. " అని ప్రజ్వల్ షెనాయ్ తెలిపాడు.

'రూ.20 వేలు ఖర్చు'

"144ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు నా కొడుకుతో కలిసి బైక్​పై వెళ్లడం గర్వంగా ఉంది. ఈ ప్రయాణానికి మాకు కేవలం రూ. 20,000 ఖర్చు అయ్యింది. మార్గమధ్యలో ఓ వ్యక్తి నా కుమారుడికి కొత్త హెల్మెట్​ను బహుమతిగా ఇచ్చాడు."
-- రాజేంద్ర షెనాయ్


తన భర్త, కొడుకుకి బస్సులో ప్రయాణించడం అలవాటు లేదని ప్రజ్వల్ తల్లి రజనీ తెలిపారు. "మాకు కారు లేదు. నా భర్త, కొడుకు బైక్ పై ప్రయాణాలు చేస్తారు. కొంత డబ్బును ఆదా చేసి ప్రయాగ్​రాజ్ వెళ్లమని వారికి ఇచ్చాను. నా కొడుకు, భర్త కుంభమేళాకు వెళ్లినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. " అని రజనీ పేర్కొన్నారు.
గతంలోనూ బైక్ యాత్ర
గతేడాది జూన్ లో తండ్రీకొడులిద్దరూ బైక్​పై హరియాణా, పంజాబ్, హిమాచల్​ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లేహ్-లద్ధాఖ్, కార్గిల్, మనాలి గుండా 10 రోజుల్లో 2,100 కి.మీ ప్రయాణించారు. సముద్ర మట్టానికి 17,982 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరమైన ఖార్దుంగ్లాపై కన్నడ జెండాను ఎగురవేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.