మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్ - మేడారంలో మంత్రుల పర్యవేక్షణ
ఏడాది సమ్కక్క సారలమ్మ దర్శనానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్నారు.

మేడారం జనారణ్యంగా మారింది. వన దేవత.. అశేష జనవాహిని రాకతో జనదేవతగా మారింది. జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సుమారు 15 వేల మంది ప్రభుత్వ యంత్రాంగం జాతర విధుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
ఏడో తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారన్నారు. ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. సుమారు కోటీ 40 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామంటున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీచూడండి: మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!