రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.
మేడ్చల్లోని 23 వార్డుల్లో 14 స్థానాల్లో కారు దూసుకుపోయింది. ఒక వార్డులో భాజపా, చెరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మేడ్చల్ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.