ETV Bharat / state

కామారెడ్డిలో కాంగ్రెస్​ నేతల దీక్ష - lockdown

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్​ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

congress raithu sankshema deeksha in kamareddy district
కామారెడ్డిలో కాంగ్రెస్​ నేతల దీక్ష
author img

By

Published : May 5, 2020, 8:32 PM IST

రైతు సమస్యల పరిష్కారానికై రాష్ట్ర కాంగ్రెస్​ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్​ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్ల అక్రమాలను, ఆగడాలను అరికట్టాలని కోరారు. రైతు పండించిన పంటను ఆలస్యం చేయకుండా వెంటనే మొత్తం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యల పరిష్కారానికై రాష్ట్ర కాంగ్రెస్​ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్​ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్ల అక్రమాలను, ఆగడాలను అరికట్టాలని కోరారు. రైతు పండించిన పంటను ఆలస్యం చేయకుండా వెంటనే మొత్తం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: రెండింటా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.