జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఇసుక క్వారీలో టిప్పర్ ఢీకొని టీఎస్ఎండీసీ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. గురువారం సాయంత్రం ఇసుక లోడింగ్కు వచ్చిన టిప్పర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి గార్డు విష్ణువర్ధన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విష్ణువర్ధన్ మృతిచెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మీర్పేట వాసి. పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!